News

ప్రతి రోజూ పెట్రోలు ధర మార్పు


వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా విశాఖపట్నం సహా ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు రోజూ మారనున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ‘ఎట్టకేలకు రోజూ చమురు ధరలు సమీక్షించే విధానంవైపు అడుగులు పడుతున్నాయి. తొలుత విశాఖపట్నం, ఉదయ్‌పూర్‌ (రాజస్థాన్‌), జంషెడ్‌పూర్‌ (ఝార్ఖండ్‌), చండీగఢ్‌, పుదుచ్చేరి నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తాం. క్రమంగా దేశం మొత్తానికీ దీన్ని విస్తరిస్తాం’అని ఐవోసీ ఛైర్మన్‌ బి.అశోక్‌ విలేకరులతో చెప్పారు.